అలీగఢ్(ఉత్తరప్రదేశ్): ‘‘నీ పెండ్లి జీవితంలో మరిచిపోలేం” ఈ డైలాగ్ను మనం సినిమాల్లోనే కాదు.. చాలా సార్లు నిజజీవితంలోనూ వింటూనే ఉంటాం. ఉత్తరప్రదేశ్లోని విధిపూర్ గ్రామస్తులు ఇప్పుడు ఇదే మాట అంటున్నారు. ఆ గ్రామానికి చెందిన సావిత్రికి గత నెలలోనే పెండ్లయ్యింది. మార్చి 21న తన అత్తారింటికి వెళ్లేందుకు 12 మంది బరాత్ బృందం వచ్చింది. వీరంతా మార్చి 23న జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆ రోజు నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలులోకి వచ్చింది. దీంతో పెండ్లి కొడుకు, పెండ్లి కూతురుతో పాటు బరాత్ కోసం వచ్చిన అందరూ విధిపూర్ గ్రామంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పటికి వారంతా వచ్చి మూడు వారాలు గడిచింది. వారంతా వెళ్లడానికి లేదు. దీంతో బరాత్ కోసం వచ్చిన కొంత మంది సహనం కోల్పోతున్నారు. కానీ ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. తన పరిస్థితి ఏమిటో తెలియక సావిత్రి పూర్తిగా గందరగోళంలో పడిపోయింది. సావిత్రి ఫ్యామిలీనే బరాత్ కోసం వచ్చిన వారందరికీ అన్ని సదుపాయాలు కల్పిస్తోంది. వారి పరిస్థితి తెలుసుకున్న జిల్లా అధికారులు ఒక పూట భోజనం అందిస్తున్నారు. బరాత్ కోసం వచ్చిన వారందరికీ కరోనా టెస్టులు చేయగా.. అందరికీ నెగెటివ్ వచ్చింది. మార్చి 20న తమ ఊరి నుంచి వచ్చేటప్పుడు అసలు ఇన్ని రోజులు ఉండాల్సి వస్తుందని తాము ఊహించలేదని బరాత్ కోసం వచ్చిన వారు చెప్పారు. లాక్డౌన్ను ఇంకా పొడిగించే అవకాశాలు కనిపిస్తుండటంతో వీరంతా ఎప్పుడు ధన్బాద్ వెళతారనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. దీంతో ఈ పెండ్లి గురించి విధిపూర్ గ్రామస్తులు మాట్లాడుతూ.. తమ జీవితంలో ఈ పెండ్లిని మాత్రం మరిచిపోలేం అని చెబుతున్నారు.
పెండ్లి బరాత్ కోసం వచ్చి బుక్కయిపోయిన్రు
- దేశం
- April 13, 2020
లేటెస్ట్
- గుజరాత్ లో భూకంపం.. ప్రస్తుతానికి అంతా కూల్
- ఆర్టిస్టులను అరెస్ట్ చేస్తారా : ఫేక్ వ్యూస్ చేశాడని వ్యక్తి అరెస్ట్..
- Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం అందుకునేది ఎప్పుడంటే?
- 4వేల 500 అడుగుల ఎత్తులో పోలింగ్ స్టేషన్..కేవలం 164ఓటర్ల కోసమట ..ఎక్కడంటే..
- రేషన్ కార్డు ఇచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం : శ్రీధర్ బాబు
- SRH vs LSG: కనిపించని వరుణుడి జాడ.. ఉప్పల్ స్టేడియానికి భారీగా చేరుకుంటున్న అభిమానులు
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay ట్రాన్జక్షన్లపై లిమిట్
- చిక్కుల్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ .. విమానాల రద్దుపై ప్రభుత్వం సీరియస్
- పిటిషన్ వేసినందుకు లక్ష రూపాయలు ఫైన్ వేసిన కోర్టు
- IPL 2024: ధోనీ, కోహ్లీ ఆల్టైం రికార్డ్ బ్రేక్.. ఐపీఎల్లో సంజు శాంసన్ అరుదైన ఘనత
Most Read News
- బేగంపేట నాళాలో కొట్టుకొచ్చుని డెడ్బాడీలు
- Good Health : మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా.. కారణాలు ఇవే.. లక్షణాలు ఇలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్
- చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి
- KIA EV3 ఎలక్ట్రిక్ SUVను మే 23న లాంఛింగ్
- Ranveer, Deepika: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట.. క్లారిటీ వచ్చేసింది!
- భారీ వర్షం.. యాదాద్రి ఆలయంలో కొట్టుకుపోయిన చలువపందిళ్లు, రేకుల షెడ్డు
- ప్రియురాలికి నిశ్చితార్థం.. ప్రియుడు సూసైడ్