
- పూర్తయిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్
హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. శుక్రవారం రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, మున్సిపల్, జైళ్ల శాఖ, కమర్షియల్ ట్యాక్స్, రవాణా శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, లేబర్, ఎక్సైజ్, వెల్ఫేర్, ట్రెజరీ శాఖలకు అభ్యర్థులు అటెండ్ అయి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పక్రియను పూర్తి చేశారు.
శనివారం శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి వీరికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేయనున్నారు. కాగా, గ్రూప్ 1లో 139 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులు(ఎంపీడీవోలు)గా , ఏడుగురు జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవోలు)గా ఎంపికయ్యారు. మల్టీజోన్-1కు 83 మంది మల్టీజోన్ -2కు 56 మంది ఎంపీడీవోలను కేటాయించారు.