మేజర్, హిట్ 2 చిత్రాలతో ఈ ఏడాది రెండు విజయాలను అందుకున్న అడివి శేష్.. ఈ జోష్తో తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. 2018లో సూపర్ సక్సెస్ను ఇచ్చిన ‘గూఢచారి’కి సీక్వెల్గా దీన్ని రూపొందిస్తున్నారు. దీనికి ‘జి 2’ అనే టైటిల్ని ఫైనల్ చేస్తూ కాన్సెప్ట్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో బ్లాక్ సూట్లో మెషీన్ గన్ పట్టుకుని యాక్షన్ మోడ్లో కనిపిస్తున్నాడు శేష్.
‘మేజర్’ చిత్రానికి ఎడిటర్గా వర్క్ చేసిన వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ మూవీ ప్రీ విజన్ వీడియోను జనవరి 9న ముంబై, ఢిల్లీలో లాంచ్ చేయనున్నారు.