తెలంగాణ సీఎం కేసీఆర్ తో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా భేటీ అయ్యారు. ప్రగతి భవన్లో జరుగుతున్న సమావేశంలో దేశ రాజకీయాలు, జాతీయ అంశాల పై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న కేసీఆర్... ఇప్పటికే ఇతర రాష్ట్రాల నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు.
ఈ క్రమంలో వాఘేలా, కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. శంకర్ సింగ్ వాఘేలా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఈ ఏడాది చివరలో గుజరాత్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్ధులను బరిలోకి దింపనున్నట్లుగా ఆయన వెల్లడించారు.
Former Chief Minister of Gujarat and former Union Minister Sri @ShankersinhBapu met with Chief Minister Sri Sri K. Chandrashekar Rao at Pragati Bhavan. The leaders have discussed country's politics and current national issues. pic.twitter.com/jqfodvZLUj
— TRS Party (@trspartyonline) September 16, 2022