- లోక్సభ స్పీకర్, చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తం
- కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గుమ్మడి కుమారస్వామి
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలో ప్రొటోకాల్ ఎందుకు పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఐఎన్టీయూసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి కుమారస్వామి ప్రశ్నించారు. ఎవరి అండ చూసుకుని ఎంపీ పట్ల ఇలా ప్రవర్తిస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు.
సోమవారం గోదావరిఖని ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల రామగుండం టౌన్లో ఈఎస్ఐ హాస్పిటల్ స్థల పరిశీలనకు ఎంపీ వంశీకృష్ణ వచ్చినప్పుడు అధికారులు తగిన ఏర్పాట్లు చేయలేదన్నారు. సోమవారం చీరల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో ఎంపీ పేరు లేదన్నారు.
గతంలో పెద్దపల్లిలో జరిగిన సభలో ఈ వ్యవహారం గురించి ఎంపీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా.. అధికారుల్లో మార్పురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ విషయంలో ఎంపీకి జరుగుతున్న అన్యాయంపై లోక్సభ స్పీకర్, నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్, చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
మున్సిపల్కార్పొరేషన్లో దారి మైసమ్మ గుడులను కూల్చివేతలకు సంబంధించి ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కమిషనర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మీటింగ్లో లీడర్లు రాచకొండ కోటేశ్వర్లు, నర్సింగ్ దొర, మగ్గిడి దీపక్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఎన్టీపీసీ బూడిదను తరలించే వ్యవహరంలో కుందనపల్లి గ్రామస్తులకు జేసీబీ మిషన్లు పెట్టుకునే అవకాశం కల్పించి , మొగల్పహాడ్ గ్రామస్తులకు ఇవ్వకపోవడం సరైంది కుమారస్వామి అన్నారు. శాంతిభద్రతల సమస్య లేకపోయినా ఎన్టీపీసీ సీఐ, అంతర్గాం ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వారిపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో మొగల్పహాడ్ గ్రామస్తులు చిలుక రాజేశం, దుబాసి ప్రవీణ్, లింగయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
