దండకారణ్యంలో తుపాకుల మోత.. మరో మావోయిస్టు మృతి..

దండకారణ్యంలో తుపాకుల మోత.. మరో మావోయిస్టు మృతి..

ఛత్తీస్ గఢ్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది.  బీజాపూర్ జిల్లా కేశకతుల్ అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్టు సమాచారం. పలువురు భద్రతా సిబ్బంది గాయపడినట్లు తెలుస్తుంది. ఘటన స్థలం నుండి భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. 

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన ఘటన మరువకముందే ఇవాళ మరో ఎన్ కౌంటర్ జరగడం కలకలం రేపుతుంది. దండకారణ్యం మొత్తం తుపాకీ చప్పుల్లతో మారుమ్రోగుతుందని స్థానికలు అటవి దగ్గర్లో నివాసం ఉండే ప్రజలు అభిప్రాయపడుతున్నారు.