ముదురుతున్న గట్టమ్మ తల్లి వివాదం ..పలువురు మహిళలకు స్వల్ప గాయాలు

ముదురుతున్న గట్టమ్మ తల్లి వివాదం ..పలువురు మహిళలకు స్వల్ప గాయాలు
  •  సర్దిచెప్పి పంపించిన పోలీసులు

ములుగు, వెలుగు: గట్టమ్మ తల్లి వివాదం ముదురుతోంది. జాకారం జీపీకి, నాయకపోడ్​ పూజారుల మధ్య ఉన్న వివాదంలోకి ముదిరాజ్ లు ఎంటర్​ కావడంతో రెండు వర్గాల మధ్య గొడవగా మారి పోయింది. ఆదివాసీ నాయకపోడ్ లు వారి కులదైవంగా భావించి నిత్యం పూజలు చేస్తున్నారు. అయితే గట్టమ్మ ఆలయం జాకారం జీపీ పరిధిలోకి వస్తుందని తామే అసలైన పూజారులంటూ ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు ముదిరాజ్​లు  ఇవాళ తరలివచ్చారు.

విషయం తెలిసిన నాయకపోడ్​లు గట్టమ్మ ఆలయం వద్దకు వచ్చారు. ఆలయంలో గట్టమ్మ తల్లి విగ్రహం వద్దకు ముదిరాజ్​ మహిళలు పూజారులమంటూ నాయకపోడ్​ మహిళలతో గొడవకు దిగారు. దీంతో తీవ్ర వాగ్వివాదం నెలకొంది. ఇరువర్గాలు కొట్టుకోవడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

ములుగు డీఎస్పీ రవీందర్​, సీఐ రంజిత్​ కుమార్​  ఆలయం వద్దకు చేరుకొని గొడవను ఆపివేశారు.  ఆలయం వివాదం తేలేవరకు గొడవలకు దిగొద్దని,  కవ్వింపు చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని సీఐ  హెచ్చరించారు. కాగా, గాయపడ్డ వారిని ములుగు ఆస్పత్రికి తరలించారు.