
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో శుక్రవారం వడగండ్ల వాన కురిసింది. మాచారెడ్డి మండలంలోని సోమార్పేట, వెనుక తండా, అంకిరెడ్డిపల్లి తండాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురవగా.. ఈదురు గాలులకు ఇంటిపైన ఉన్న రేకులు ఎగిరిపోయాయి. చెట్లు విరిగి నేలకొరిగాయి. సోమార్పేటలో మామిడి చెట్టు ట్రాక్టర్పై పడటంతో రవి అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్ ధ్వంసమైంది. కోతకొచ్చిన వరి పంట నేలకొరిగింది. ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. వాన నీళ్లలో వడ్లు కొట్టుకుపోయాయి.