రంజాన్ మానియా : ఫ్యామిలీ ఫ్యామిలీ హలీం, బిర్యానీ తినేశారే..

రంజాన్ మానియా : ఫ్యామిలీ ఫ్యామిలీ హలీం, బిర్యానీ తినేశారే..


సరిగ్గా నెల రోజులు.. 30 రోజుల్లో.. అది కూడా రంజాన్ నెలలో.. హైదరాబాదీలు 10 లక్షల బిర్యానీలు, 4 లక్షల హలీంలు ఆర్డర్ చేశారు. ఇది జస్ట్ ఒక్క స్విగ్గీలో మాత్రమే. ఈ లెక్క చూస్తుంటే.. నెల రోజులుగా హైదరాబాదీలు ఫ్యామిలీ ఫ్యామిలీ బిర్యానీ, హలీం తినేసింది అనటానికి ఇదే సాక్ష్యం. గత ఏడాదితో పోల్చితే ఇది 20 శాతం అదనం కావటం మరో విశేషం. ప్రతి ఏటా హైదరాబాద్ లో హలీం సేల్స్ భారీగా పెరగటం చూస్తుంటే.. రంజాన్ నెల కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారు అనేది డిసైడ్ అయిపోతుంది. 

రంజాన్ నెలలో ఫుడ్ ఆర్డర్స్ పై స్విగ్గీ రిలీజ్ చేసిన డేటా షాకింగ్ గా ఉంది. ఒక్క హైదరాబాద్ సిటీ, సిటీ శివార్లను పరిగణలోకి తీసుకుంటే.. రంజాన్ మాసంలో వన్ మిలియన్.. అంటే 10 లక్షల బిర్యానీ ఆర్డర్స్ బుక్ అయ్యాయి. 4 లక్షల హలీం ఆర్డర్స్ వచ్చాయిం. మొత్తం 350 రెస్టారెంట్ల నుంచి 50 శాతం ఆర్డర్స్ రాగా.. ఇందులో పిస్తా హౌస్ హలీం టాప్ పొజిషన్ లో ఉంది. ఇక బిర్యానీ ఆర్డర్స్ లో ప్యారడైజ్, మెహఫిల్ ఫేవరేట్ గా నిలిచింది. 

హలీంలో చాలా రకాలు ఉన్నా.. మటన్ హలీం వాటా 77 శాతంగా ఉంది. ఆ తర్వాత చికెన్ హలీంను ఫేవరేట్ గా ఆర్డర్ చేశారు హైదరాబాదీలు. రంజాన్ నెలలో డ్రైఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్స్ సైతం భారీగా ఆర్డర్స్ వచ్చాయని.. మెజార్టీ మాత్రం హలీం, బిర్యానీ నిలిచిందని స్పష్టం చేసింది స్విగ్గీ.  2023, మార్చి 23 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు డేటా ఇది. మిగతా ఐదు రోజుల్లో ఇంకెన్ని లక్షల ఆర్డర్స్ చేశారో జనం..