- ఎంపీ కుందూరు రఘవీర్ రెడ్డి, సాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి
హాలియా, వెలుగు: కేటీఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే బీఆర్ఎస్ను ప్రజలు తరిమికొడ్తారని నల్గొండ ఎంపీ కుందూరు రఘవీర్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి చెరుపల్లి ముత్యాలు కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 ఏండ్ల పాలనలో తెలంగాణను అన్ని విధాలుగా దోచుకుని ప్రజలను వంచించిన బీఆర్ఎస్ను మున్సిపల్ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అభ్యర్ధి చెరుపల్లి ముత్యాలు, నాయకులు కాకునూరి నారాయణగౌడ్, అంకతి సత్యం, వెంపటి శ్రీనివాస్, కొండ శ్రీనివాసరెడ్డి, నరేందర్తదితరులు పాల్గొన్నారు.
