హాల్ టికెట్స్ ఇచ్చినా పరీక్ష పెట్టలే..

హాల్ టికెట్స్ ఇచ్చినా పరీక్ష పెట్టలే..

దాదాపు రెండేళ్ల నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ఏమీ లేకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. కరోనా కారణంగా రెండేళ్ల క్రితమే నిర్వహించాల్సిన ఆర్మీ ఎగ్జామ్ కూడా వాయిదా పడడంతో... ఈ ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. హాల్ టికెట్స్ ఇచ్చినా పరీక్ష నిర్వహించలేదని అభ్యర్థులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా వారిలో త్వరలోనే కొందరికి ఏజ్ బార్ కూడా కానుండడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అగ్నిపథ్ అంశం తెరపైకి రావడంతో విషయం తేల్చుకుందాం అంటూ వివిధ రాష్ట్రాల నుంచి  అభ్యర్థులు హకీంపేట్ కి  వచ్చినట్టు సమాచారం.