
జెరూసలెం: హమాస్ గాజా చీఫ్ మహమ్మద్ సిన్వర్ హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం వెల్లడించారు. మే 13న గాజాలోని యూరోపియన్ ఆసుపత్రి సమీపంలో ఉన్న ఒక భూగర్భ బంకర్పై దాడి చేశామని చెప్పారు. ఈ దాడిలోనే మహమ్మద్ సిన్వర్ కూడా చనిపోయినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇజ్రాయెల్ పార్లమెంట్లో నెతన్యాహు మాట్లాడారు.
ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన హమాస్ నేతల జాబితాను ప్రకటించారు. " సిన్వర్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైనిక దళాలు ఖాన్ యూనిస్ లోని యూరోపియన్ ఆసుపత్రి కింద ఉన్న భూగర్భ బంకర్పై దాడులు చేసింది. యుద్ధ విమానాలతో డజన్ల కొద్దీ బాంబులు వదిలాయి. ఈ ఘటనలో మహమ్మద్ కూడా మృతి చెందాడు" అని నెతన్యాహు వెల్లడించారు.