ట్రైన్​లో పోగొట్టుకున్న 9.5 తులాల గోల్డ్​ అప్పగింత

ట్రైన్​లో పోగొట్టుకున్న 9.5 తులాల గోల్డ్​ అప్పగింత

సికింద్రాబాద్, వెలుగు: వైజాగ్​ నుంచి సికింద్రాబాద్ ​చేరుకున్న ఓ ప్రయాణికుడు ట్రైన్​లో 9.5 తులాల బంగారు ఆభరణాలు ఉన్న సూట్కేస్​ను పోగొట్టుకోగా, రైల్వే పోలీసులు గుర్తించి అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన గణేశ్ బంధువుల ఇంట్లో జరుగుతున్న పెండ్లి కోసం వైజాగ్ వెళ్లాడు. ఆదివారం ఉదయం గరీబ్​రథ్ ​ట్రైన్​లో సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​కు ​చేరుకున్నాడు.

ట్రైన్ ​దిగే టైంలో తన వెంట తెచ్చుకున్న సూట్​కేస్​ను బోగీలోనే మర్చిపోయాడు. స్టేషన్ ​బయటికి వెళ్లక ముందే గుర్తించిన గణేశ్​ వెంటనే ట్రైన్​లోకి వెళ్లి చూడగా సూట్​కేస్ ​కనిపించలేదు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తన సిబ్బందితో తనిఖీ చేపట్టగా స్టేషన్​లోని ఓ ప్రయాణికుడు వద్ద సూట్​కేస్​ను గుర్తించి గణేశ్​కు అప్పగించారు. కాగా అందులో 9.5 తులాల బంగారు ఆభరణాలు, రెండు సెల్ ఫోన్లు ఉన్నాయి.