కొండగట్టుకు కవిత..82 రోజులు హనుమాన్ చాలీసా పారాయణం

 కొండగట్టుకు కవిత..82 రోజులు హనుమాన్ చాలీసా పారాయణం

జగిత్యాల జిల్లా కొండగట్టులో అఖండ హనుమాన్ ఛాలీసా పారాయణ కార్యక్రమం వైభవంగా మొదలైంది. రాష్ట్రంలో పీడలు తొలగి జనం సుఖశాంతులతో ఉండాలని కోరుతూ....కొండగట్టు వేదికగా పారాయణ కార్యక్రమాన్ని నిర్ణయించారు ఎమ్మెల్సీ కవిత. 82 రోజుల పాటు సాయంత్రం గంటపాటు గ్రామంలోని ఇళ్లలో హనుమాన్ ఛాలీసా చదవనున్నారు. ఇందుకోసం కొండగట్టుకు చేరుకున్నారు కవిత. అఖండ పారాయణంలో భాగంగా...కొండగట్టు వై జంక్షన్ నుంచి దేవస్థానం వరకు శోభాయాత్ర జరగనుంది. శ్రీరామకోటి స్థూప నిర్మాణం పనులను కూడా కవిత ప్రారంభించనున్నారు.