హాస్టల్లో ఉండాలంటేనే భయంగా ఉందని ఆవేదన
షీటీమ్స్కు ఆడియో రూపంలో ఫిర్యాదు
బషీర్బాగ్, వెలుగు: కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. వర్సిటీలో పీజీ చదువుతున్న విద్యార్థినులు, తాము ఉంటున్న ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో మెస్ ఇన్చార్జ్ వినోద్ తమను వేధిస్తున్నాడంటూ షీటీమ్ పోలీసులకు ఆన్లైన్ద్వారా ఫిర్యాదు చేశారు. తమ ఆవేదనను ఆడియో రూపంలో వెల్లడించారు.
వినోద్ ప్రవర్తన వల్ల హాస్టల్లో ఉండాలంటేనే భయంగా ఉందని, తమ భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వినోద్ వల్ల అనేక మంది విద్యార్థినులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఇప్పటికే హాస్టల్ వార్డెన్, కాలేజీ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రహస్యంగా ఆన్లైన్ ద్వారా షీటీమ్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. తమ పేర్లు బయటకు వస్తే కెరీర్కు, భవిష్యత్కు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి వినోద్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
