
తెలంగాణలో షర్మిల కొత్త పార్టీపై మంత్రి హరీశ్ రావు పరోక్షంగా కౌంటర్ వేశారు. తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారా అని అడిగేవాళ్లకు.. ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉందా అని ప్రశ్నించారు. ఇక్కడకు వచ్చి రైతులపై కొందరు మొసలి కన్నీరు కారుస్తున్నారని.. వాళ్లకు తెలంగాణ గురించి ఏమైనా తెలుసా అని అన్నారు. తెలంగాణలో రైతు సంక్షేమం కోసం ఖర్చు చేసే బడ్జెట్ మీద పరిజ్ఞానం ఉందా అని కామెంట్ చేశారు. ఏపీ ప్రభుత్వం రైతులకు కేవలం 12వేల 500 రూపాయలు ఇస్తే, తెలంగాణలో ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇస్తున్నామన్నారు.
see more news