హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో దురదృష్టవశాత్తు ఓడిపోయామని, అందుకు బాధ పడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, భవిష్యత్తులో మళ్లీ అధికారం బీఆర్ఎస్దేనన్నారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మహబూబాబాద్లోక్సభ ఎన్నిక సన్నద్ధత సమావేశంలో హరీశ్రావు పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ వచ్చిన నాడు పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవాలని కేసీఆర్ ఎంతో కృషి చేశారని చెప్పారు.
ఒక్క మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోనే 4 మెడికల్ కాలేజీలు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేసిందని.. వాటిని ప్రజలు నమ్మారన్నారు. లోక్సభ ఎన్నికల్లో అందరూ కష్టపడి పని చేయాలని ఆయన సూచించారు. నెల రోజులైతే కేసీఆర్.. తెలంగాణ భవన్కు వస్తారని, అందరం అక్కడే అందుబాటులో ఉంటామన్నారు. బీఆర్ఎస్ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ అని, గెలుపోటములు మనకు కొత్త కాదన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తేలేదన్నారు. కాంగ్రెస్ నేతలకు హామీలు అమలు చేయడం చేతకాక కాళేశ్వరం
విద్యుత్ రంగంలో అవినీతి అంటూ గోబెల్స్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలను కాపాడేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని, అవసరమైన వారి పిల్లలకు సహాయం అందిస్తామన్నారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే లీగల్సెల్నుంచి సాయం అందిస్తామన్నారు. జిల్లా ఆఫీసుల్లోనూ లీగల్ సెల్ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు.
కాంగ్రెస్లో కుమ్ములాటలు మొదలైనయ్ : కడియం
కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడే కుమ్ములాటలు మొదలయ్యాయని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. పొంగులేటి తానే నంబర్2 అంటున్నారని, భట్టి సీఎం కాలేదని ఆయన భార్య వాపోతున్నారని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టే ఓడిపోయామని, 2028 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్నారు. కేటీఆర్, హరీశ్రావు కృష్ణార్జులని, వారిద్దరు కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని
కార్యకర్తలకు అగ్రనాయకత్వం అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. లోక్సభఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేద్దామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. వైఎస్సార్, చంద్రబాబును ఎదుర్కొన్న బీఆర్ఎస్కు రేవంత్ను ఎదుర్కోవడం లెక్కకాదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.