
- రుణమాఫీ గైడ్లైన్స్పై హరీశ్రావు విమర్శ
హైదరాబాద్, వెలుగు: రుణమాఫీ విషయంలో రైతుల వలపోతల(ఆవేదన) కంటే వడపోతలపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కంటే ప్రభుత్వ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తోందని విమర్శించారు. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ మాట మార్చిందని మండిపడ్డారు.
సోమవారం ఆయన..సర్కార్ ప్రకటించిన రుణమాఫీ మార్గదర్శకాలపై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. 2018 డిసెంబర్ 12కి ముందు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించదనే నిబంధన సమంజసం కాదని హరీశ్ అన్నారు. ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ ఉల్లంఘనల పట్ల మరో ప్రకటనలో హరీశ్ స్పందించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.