ఇండియా ఫ్లాగ్‌‌‌‌ బేరర్లుగా: హర్మన్‌‌‌‌ సింగ్‌‌‌‌, లవ్లీనా

ఇండియా ఫ్లాగ్‌‌‌‌ బేరర్లుగా: హర్మన్‌‌‌‌ సింగ్‌‌‌‌, లవ్లీనా
  • మరో  రెండు రోజుల్లో ఆసియా గేమ్స్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా మెన్స్‌‌‌‌ హాకీ టీమ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ సింగ్‌‌‌‌, ఒలింపిక్‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌ బాక్సర్‌‌‌‌ లవ్లీనా బొర్గొహైన్‌‌‌‌ ఆసియా గేమ్స్‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌ సెర్మనీలో ఇండియా ఫ్లాగ్‌‌‌‌ బేరర్లుగా ఎంపికయ్యారు. ఈ నెల 23న జరిగే సెర్మనీలో  ఈ ఇద్దరూ త్రివర్ణ పతాకంతో ఇండియా అథ్లెట్లను ముందుండి నడించనున్నారు.

ఈ మెగా ఈవెంట్‌‌‌‌కు ఇద్దరు ఫ్లాగ్‌‌‌‌ బేరర్లు ఉండాలని ఇండియన్ ఒలింపిక్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (ఐఓఏ) నిర్ణయించింది.  కాగా, ఆసియా గేమ్స్‌‌‌‌లో ఇండియా ఈసారి అత్యధికంగా 655 మంది అథ్లెట్లను బరిలోకి దింపుతోంది.