కర్నాల్‌లో హర్యానా సీఎం నామినేషన్.. ఉప ఎన్నిక బరిలో నిలిచిన నాయబ్ సింగ్ సైనీ

కర్నాల్‌లో హర్యానా సీఎం నామినేషన్.. ఉప ఎన్నిక బరిలో నిలిచిన నాయబ్ సింగ్ సైనీ

చండీగఢ్: హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ కర్నాల్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు నాయబ్ సింగ్ సైనీ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తో కలసి ఓపెన్ టాప్ జీపులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సైనీ విలేకర్లతో మాట్లాడారు. ‘‘మాకు ప్రజా మద్దతు ఉంది. కర్నాల్​ సహా ప్రతిచోటా బీజేపీకిని ఆదరిస్తున్నారు. 

హర్యానాలోని లోక్ సభ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలుస్తాం. గతంతో పోల్చుకుంటే  కర్నాల్ అభివృద్ధి చెందింది. ఆ తేడాను గమనించవచ్చు. రాష్ట్రం, దేశంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది”అని పేర్కొన్నారు. కాగా, కర్నాల్ అసెంబ్లీ బైపోల్ తో పాటు రాష్ట్రంలోని10 పార్లమెంటు స్థానాలకు మే 25న ఓటింగ్ జరగనుంది.