- 5 కిలోల గోల్డ్, ఖరీదైన 100 లిక్కర్ బాటిళ్లు.. సీజ్ చేసిన ఈడీ
న్యూఢిల్లీ : హర్యానాలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) పార్టీ మాజీ ఎమ్మెల్యే దిల్ బాగ్ సింగ్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిర్వహించిన రెయిడ్స్లో భారీగా డబ్బు, విదేశీ తుపాకులు, వందల బుల్లెట్లు, కిలోలకొద్దీ బంగారం, ఖరీదైన లిక్కర్ పట్టుబడింది. అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర పన్వర్, మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్, ఆయన సన్నిహితుల ఇండ్లపై ఈడీ గురువారం ఉదయం దాడులు చేసింది. రైడ్స్శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ తనిఖీలో బయటపడుతున్న డబ్బు, బంగారం, తుపాకులను చూసి ఈడీ ఆఫీసర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. యమునానగర్ ప్రాంతాల్లో జరిగిన అక్రమ మైనింగ్పై 2013లో పోలీసులు కేసు నమోదు చేశారు. అదే ఏడాది మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లో వీరు నిందితులు. హర్యానా 2020లో తీసుకొచ్చిన ‘ఇ– రవాణా’ అనే విధానాన్ని కాపీ కొడుతూ వీరిద్దరు నకిలీ బిల్లులు ఇస్తున్నట్లు ఈడీ ఆరోపించింది.