
వెల్దుర్తి, వెలుగు: వెల్దుర్తి మండలం హస్తాల్ పూర్ గ్రామస్తులు అయిదు రోజులుగా తాగునీరు రావడం లేదని ఆందోళన చేట్టారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగరేసేందుకు వచ్చిన గ్రామ కార్యదర్శి శివశంకర్, అధికారులను అడ్డుకున్నారు. గ్రామంలో నెలకొన్న మంచి నీటి సమస్యను పరిష్కరించిన తర్వాతే జెండాను ఎగురవేయాలని మహిళలు, గ్రామస్తులు ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేశారు.
సాయంత్రం లోపు బోరు మోటారు ఏర్పాటుచేసి సమస్య తీరుస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆ తర్వాత పంచాయతీ కార్యదర్శి జాతీయ జెండాను ఆవిష్కరించారు.