హయత్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో ఉద్రిక్తత

హయత్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో ఉద్రిక్తత

హయత్ నగర్ లోని హత్తిగూడాడబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్థానికులకు కాకుండా ఓల్డ్ సిటీకి చెందిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తున్నారని బాధితులతో కలిసి బీజేపి నేతల ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహా రెడ్డి ఆద్వర్యంలో ప్రశ్నించేందుకు బీజేపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. 

 Also Read : క్యాబ్ డ్రైవర్ అకౌంట్ లో రూ.9 వేల కోట్లు.. ఆ 30 నిమిషాల్లో ఏం జరిగిందంటే..!

డబుల్ బెడ్ రూమ్ లు స్థానికులకే కేటాయించాలని రోడ్డుపై ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో డబుల్ ఇండ్ల వద్దకు వెళ్లకుండా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.