
సీతాపురం కాలనీలో బుధవారం హయత్ నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కలిపించేందుకు తాను మరో అడుగు ముందుకు వేస్తున్నానన్నారు. ఇప్పటి వరకు ఖాకీ షర్ట్తో పారిశ్యుధ్యం పై యుద్ధం చేశానని, ఇక నుంచి ప్లాస్టిక్ పై సమరానికి బ్లాక్ డ్రెస్ పై ‘సే నో ప్లాస్టిక్’ నినాదంతో వస్తున్నానన్నారు. ప్లాస్టిక్ తో పాటు ఇంకుడు గుంతలు, హరితహారం థీమ్లకు అనుగుణంగా ఇక నుంచి దుస్తులు వేసుకుంటానన్నారు.