హైదరాబాద్ హయత్ నగర్లో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. బాలికను ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశారు కొందరు దుండగులు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. దుండగుల నుంచి తప్పించుకున్న బాలిక.. రోడ్డు మీదికి వచ్చి ఏడుస్తూ సహయం కోసం అర్ధించింది. అటుగా వెడుతున్న ఓ హిజ్రా బాలికను చూసి.. రక్షించింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..బాలికను ఆసుపత్రిలో చేర్చారు.