
న్యూఢిల్లీ: హెచ్సీఎల్ టెక్నాలజీస్ గత డిసెంబర్తో ముగిసిన మూడో క్వార్టర్ ఫలితాలను సోమవారం ప్రకటించింది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 5.5 శాతం పెరిగి రూ. 4,591 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల నుంచి ఆదాయం ఐదు శాతం పెరిగి రూ.29,890 కోట్లకు చేరుకుంది.గత ఏడాది ఇదే కాలంలో రూ.28,446 కోట్లు వచ్చాయి. కంపెనీ రూ.18 చొప్పున ఇంటెరిమ్ డివిడెండ్, ఆరు రూపాయల చొప్పున ప్రత్యేక డివిడెండ్ప్రకటించింది.