జితేందర్ ఆర్ట్​ వర్క్​ చూస్తే వావ్ అనాల్సిందే

జితేందర్ ఆర్ట్​ వర్క్​ చూస్తే వావ్ అనాల్సిందే

ఏ పని చేసినా అందులో క్రియేటివ్​గా ఉండాలి. అప్పుడే గుర్తింపుతో పాటు గిరాకీ కూడా పెరుగుతుంది. ఈ చెఫ్​ కూడా అదే చేస్తున్నాడు. టేస్టీగా వండడమే కాదు తన కలినరీ స్కిల్​తో ఫుడ్​ ఆర్ట్​ చేస్తాడు కూడా.  పండ్ల మీద సెలబ్రిటీల బొమ్మలు గీయడంలో ఎక్స్​పర్ట్ ఇతను. పేరు జితేందర్. ఉండేది ఢిల్లీలో. ఈమధ్యే లతామంగేష్కర్​ బొమ్మ గీశాడు ఈ చెఫ్. ‘మేరీ ఆవాజ్​ హీ, మేరీ పహెచాన్​’ అని హిందీలో రాశాడు. పెద్ద పుచ్చకాయ​ మీద లత బొమ్మ వేసి ఆమె మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ ఫొటోని ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు. గతంలో వింగ్ కమాండర్ అభినందన్​ బొమ్మ కూడా వాటర్​మెలన్​పై గీశాడు. గాంధీ, సుభాష్ చంద్రబోస్​, చంద్రశేఖర్ ఆజాద్​ ఫొటోల్ని కూడా పండ్ల మీదకు తెచ్చాడు ఈ క్రియేటివ్ చెఫ్​. ఇతని ఆర్ట్​వర్క్​ చూసినవాళ్లంతా ‘వావ్’​ అంటున్నారు. ఫుడ్​ ఆర్ట్​తో గుర్తింపు తెచ్చుకున్న ఇతనికి ఇన్​స్టాగ్రామ్​లో 2 లక్షల పైనే ఫాలోవర్స్​ ఉన్నారు.