నేను హీరో అవ్వడానికి ఆయనే కారణం : విశాల్

నేను హీరో అవ్వడానికి ఆయనే కారణం : విశాల్

విశాల్, సునయన జంటగా ఏ.వినోద్ కుమార్ దర్శకత్వంలో రమణ, నంద నిర్మిస్తున్న చిత్రం ‘లాఠీ’. డిసెంబర్ 22న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా  సోమవారం తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ బాబు మాట్లాడుతూ ‘విశాల్ తండ్రి నాతో ‘యమ్.ధర్మరాజు ఎం.ఎ’ చిత్రాన్ని నిర్మించారు. విశాల్ నటించిన సినిమాలన్నీ బాగుంటాయి. ‘పందెంకోడి’ బాగా నచ్చింది. 

‘లాఠీ’లో పోలీస్ కానిస్టేబుల్‌‌గా నటించాడు. పోలీస్ కథలు గ్యారెంటీగా హిట్ అవుతాయనే నమ్మకం ఉంది’ అన్నారు. విశాల్ మాట్లాడుతూ ‘మోహన్ బాబు గారికి నేను మూడో కొడుకుని. నేను హీరో అవ్వడానికి ఆయనే కారణం. ‘యమ్. ధర్మరాజు ఎం.ఎ’ షూటింగ్‌‌లో నన్ను చూసి, ‘తప్పకుండా హీరో అవుతావు’ అని చెప్పారు. ఆరోజు ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఇక ‘లాఠీ’ సినిమా ప్రతి కానిస్టేబుల్‌కి ఒక ట్రిబ్యూట్. సొసైటీ కోసం తన జీవితాన్ని త్యాగం చేసే వాళ్ళు రియల్ లైఫ్ హీరోలు. ఈ సినిమాకి వాళ్ళే ఇన్‌స్పిరేషన్’ అని చెప్పాడు.