కడప జిల్లా ప్రొద్దుటూరులో ఘోరం జరిగింది. స్నేహితుడిని చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టాడు. నెల రోజుల క్రితంఈశ్వర్ రెడ్డి నగర్లో ని ఇంట్లో గొడవపడిన సతీష్ ఈశ్వర్ రెడ్డి నగర్ లోని తన ఫ్రెండ్ కిషోర్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో వాసన రావడంతో కిషోర్ ను తల్లి ప్రశ్నించారు. దీంతో సతీష్ మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చేశానని చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
సతీష్ ను కిశోరే చంపి ఇంట్లోనే పూడ్చి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఇంట్లో పూడ్చిన సతీష్ మృతదేహాన్ని బయటకు తీశారు. కిశోర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సతీష్ తమ ఇంట్లో చనిపోవడంతో భయపడి ఇంట్లోనే పాతిపెట్టానని కిషోర్ పోలీసులతో చెప్పినట్లు సమాచారం.