
సుల్ (జర్మనీ): ఇండియా యంగ్ షూటర్, హైదరాబాదీ ధనుష్ శ్రీకాంత్ ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్లో రెండు మెడల్స్ నెగ్గాడు. మెన్స్ 10 మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. టోర్నీలో ఇండియాకు ఇది మూడో గోల్డ్. సోమవారం జరిగిన 24 షాట్ల ఫైనల్లో శ్రీకాంత్ అత్యధికంగా 249.4 పాయింట్లు స్కోరు చేసి పసిడి నెగ్గాడు. స్వీడన్కు చెందిన పోంటస్ కలిన్ 248.1 పాయింట్లతో సిల్వర్ , ఫ్రాన్స్ షూటర్ రొమైన్ ఆఫ్రెరె (227.1) బ్రాంజ్ గెలిచారు. కాగా, 10మీ. ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ధనుష్ సిల్వర్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో ఇండియా మూడు గోల్డ్ సహా 9 మెడల్స్తో టాప్లో ఉంది.