లోకాయుక్త ఆఫీసులో తుపాకీ కాల్చుకున్న హెడ్ కానిస్టేబుల్

లోకాయుక్త ఆఫీసులో తుపాకీ కాల్చుకున్న హెడ్ కానిస్టేబుల్

కర్నూల్ లోకాయుక్త ఆఫీసులో తుపాకీతో కాల్చుకుని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.   లోకాయుక్త ఆఫీసు వద్దకు సత్యనారాయణ  బందోబస్తుకు వచ్చారు. 

అక్కడ బాత్రూంలోకి వెళ్లిన ఆయన  ఎస్ ఎల్ఆర్ గన్ తో కాల్చుకున్నారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు.  కానిస్టేబుల్ మృతికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. సత్యనారాయణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు.