కారును ఢీ కొట్టిన లారీ..హెడ్ కానిస్టేబుల్ మృతి

కారును ఢీ కొట్టిన లారీ..హెడ్ కానిస్టేబుల్ మృతి

కామారెడ్డి జిల్లాలో  రోడ్డు ప్రమాదం  జరిగింది. తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామ శివారులో కారును ఢీ కొట్టింది లారీ. ఈ ఘటనలో  కారులో ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్(45) తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందాడు.  

తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు  శ్రీనివాస్ గౌడ్.  డ్యూటీ నిమిత్తం కామారెడ్డి నుంచి తాడ్వాయి వైపు వెళ్తుండగా  ప్రమాదం జరిగింది.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు  తాడ్వాయి పోలీసులు.