తెలంగాణని హెల్త్ డిస్టినేషన్‌గా తీర్చిదిద్దుతాం: ఆరోగ్య శాక మంత్రి

తెలంగాణని హెల్త్ డిస్టినేషన్‌గా తీర్చిదిద్దుతాం: ఆరోగ్య శాక మంత్రి

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిహా ఈరోజు నిమ్స్ హాస్పిటల్ లో DSA ల్యాబ్, CPR స్కిల్ లాబ్స్  లను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రాన్ని హెల్త్ డిస్టినేషన్ గా తీర్చిదిద్దుతామని, జాతీయ స్థాయిలో నిమ్స్ కు గుర్తింపు ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. USAID సంస్థ సహకారంతో రూ.5 కోట్లతో అడ్వాన్సుడ్ హై ఫిడిలిటీ టెక్ ఎనేబుల్డ్ క్రిటికల్ కేర్ సిమ్యులేషన్ స్కిల్ ల్యాబ్ దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా నిమ్స్ ఆస్పత్రిలో ప్రారంభించినందుకు మంత్రి డాక్టర్లను అభినందించారు. 

క్రిటికల్ కేర్ సిమ్యులేషన్ స్కిల్ ల్యాబ్ లో CPR  చేసే విధానాన్ని మంత్రి స్వయంగా పరిశీలించారు. దీంతో పాటు రూ.12లో నిర్మించిన డీఎస్ఏ ల్యాబ్ ను ప్రారంభించారు. అనంతరం నిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా నియమించిన 39 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు, 300 మంది స్టాఫ్ నర్స్ లకు నియామక పత్రాలను అందించారు. నిమ్స్ అభివృద్ధికి ప్రభుత్వ కృషి చేస్తోందని మంత్రి చెప్పారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ... జాతీయ స్థాయిలో NIMS కు బ్రాండ్ ఇమేజ్ ఉందన్నారు. NIMS బ్రాండ్ కొనసాగేలా తనవంతు సహకారం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ, ఆసుపత్రిలో తో పాటు నిమ్స్ ఆస్పత్రి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ రాష్ట్రాన్ని హెల్త్ డెస్టినేషన్ గా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపును రావడానికి కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని CM రేవంత్ రెడ్డి సహకారంతో మెడికల్ టూరిజంతో పాటు హెల్త్ ఎడ్యుకేషన్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుకు కృషి చేస్తున్నామన్నారు. 

ALSO READ :- శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి... లక్షల మందితో కిటకిట

వచ్చే 20ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్య, వైద్య రంగాలు మరింత అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. నిమ్స్ హాస్పిటల్ డెవలప్మెంట్ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేలా నిమ్స్ డైరెక్టర్ తో చర్చించారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, డీన్ లీజ రాజశేఖర్, మెడికల్ సూపరింటెండెంట్ డా.నిమ్మ సత్యనారాయణ, కార్డియాలజీ విభాగదిపతి డాక్టర్ సాయి సతీష్ తోపాటు పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.