
అశ్వారావుపేట, వెలుగు: మంచం పట్టిన రెడ్డిగూడెం జ్వరాలతో వణుకుతున్న గ్రామస్తులు అనే వివరాలతో ‘వెలుగు’ లో ఆదివారం ప్రచురితమైన కథనానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మలేరియా అధికారి స్పందించారు. డాక్టర్ స్పందన రెడ్డిగూడెం గ్రామాన్ని సందర్శించి వైద్య ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. వినాయకపురం పీహెచ్సీలో రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. బండారు గుంపు, మేడారం కాలనీలో దోమల మందు పిచికారీని పరిశీలించారు.
హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ రక్త నమూనాలను సేకరించి మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ రామదాస్, మోహన్, సిబ్బంది వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం నాంచారి తదితరులు పాల్గొన్నారు.