5100 ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై నేడు హైకోర్టులో విచారణ

5100 ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై నేడు హైకోర్టులో విచారణ

హైదరాబాద్: ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ రూట్లను ప్రయివేటీకరణ చేయడాన్ని సవాలు చేస్తూ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్ రావ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం 5100 ఆర్టీసీ రూట్లను ప్రయివేటీకరణ చేయాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని నిలిపి వేయాలని కోరుతూ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్ రావ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది.