ఎంట్రెన్స్ టెస్టులకు భారీగా అప్లికేషన్లు

ఎంట్రెన్స్ టెస్టులకు భారీగా అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు: వివిధ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించనున్న ఎంట్రెన్స్ టెస్టులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటివరకు ఎంసెట్​కు 2,61,616 దరఖాస్తులు అందగా, రూ.500 ఫైన్​తో ఈ నెల 17 వరకు గడువుంది. ఈ సెట్​కు 22,549 అప్లికేషన్లు రాగా, రూ.500 ఫైన్​తో ఈ నెల 14 దాకా దరఖాస్తు చేసుకునే చాన్స్ ఉంది. ఐసెట్​కు ఇప్పటివరకు 30,941 దరఖాస్తులు రాగా, ఈ నెల 27 వరకు ఫైన్​ లేకుండా దరఖాస్తు చేయొచ్చు. పీజీఈసెట్​కు 4,462 దరఖాస్తులు రాగా.. ఈ నెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. లాసెట్, పీజీలాసెట్​కు 24,242 అప్లికేషన్లు అందగా, ఈ నెల 16 దాకా దరఖాస్తు చేయొచ్చు. ఎడ్​సెట్​కు 16,437 అప్లికేషన్లు రాగా, ఈ నెల 15 వరకూ అప్లై చేసుకోవచ్చు. పీఈసెట్​కు 1,128 దరఖాస్తులు రాగా.. ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. పీఈసెట్​ను ఆగస్టు 22న నిర్వహిస్తామని అధికారులు తాజాగా ప్రకటించారు.