యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 3 గంటలు

యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 3 గంటలు

యాదగిరిగుట్టలో   భక్తుల రద్దీ కొనసాగుతోంది.  ఆదివారం సెలవు  కావడంతో నర్సన్న దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది.  తెల్లవారుజామున నుంచే క్యూలైన్లో బారులు తీరారు. ఉచిత దర్శనానికి  3 గంటల  సమయం పడుతోంది.   ప్రత్యేక ప్రవేశ 150 రూపాయల దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.

భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఉచిత దర్శనానికి 3గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. లడ్డు ప్రసాదం కౌంటర్లు, కల్యాణ కట్ట వద్ద కూడా భక్తుల కోలాహలం నెలకొంది.

భక్తుల రద్దీని ముందే ఊహించిన ఆలయ సిబ్బంది భక్తలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బంది.