శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ప్రస్తుతం ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 2 లక్షల  78 వేల క్యూసెక్కుల వరద వస్తోందని చెప్పారు ఇరిగేషన్ అధికారులు. జూరాల నుంచి లక్షా 47 వేల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి  మరో లక్షా 31 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 840.10 అడుగుల నీటిమట్టం ఉంది. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి 31 వేల 784 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.