
- కామారెడ్డి జిల్లాలో రెండో రోజూ ఈదురు గాలులతో వర్షం
- కూలిన చెట్లు..విరిగిన విద్యుత్ స్తంభాలు
- సోమూర్లో 7 సెం.మీ వర్షం
కామారెడ్డి, వెలుగు : జిల్లాలో సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు గ్రామాలు, మండల కేంద్రాల్లో చెట్లు కూలగా, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో మంగళవారం పగలు వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సిబ్బంది కరెంట్ స్తంభాలను పునరుద్ధరించి, లైన్లను సరి చేశారు. మెయిన్ రోడ్లపై చెట్లు కూలడంతో రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి.
మండలం సోమూర్లో 7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రామారెడ్డి 3.3, మాచాపూర్లో 3.3, బొమ్మదేవునిపల్లి 2.9, నాగిరెడ్డిపేట 2.7, ఆర్గొండ 2.6, డొంగ్లిలో 2.5, హాసన్ పల్లి 2.5, మెనూర్ 2.1, లింగంపేట 1.9, బీబీపేట 1.9, జుక్కల్, కొల్లూర్లలో 1.7, కామారెడ్డి 1.3, సదాశివనగర్లో 1.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.