కామారెడ్డి జిల్లాలో వర్షబీభత్సం

కామారెడ్డి జిల్లాలో వర్షబీభత్సం
  • కామారెడ్డి జిల్లాలో రెండో రోజూ ఈదురు గాలులతో వర్షం
  • కూలిన చెట్లు..విరిగిన విద్యుత్​ స్తంభాలు
  • సోమూర్​లో 7 సెం.మీ వర్షం 

కామారెడ్డి, వెలుగు : జిల్లాలో సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు గ్రామాలు, మండల కేంద్రాల్లో చెట్లు కూలగా, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో మంగళవారం పగలు వరకు విద్యుత్​ అంతరాయం ఏర్పడింది. సిబ్బంది కరెంట్​ స్తంభాలను పునరుద్ధరించి, లైన్లను సరి చేశారు. మెయిన్​ రోడ్లపై చెట్లు కూలడంతో రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి.

మండలం సోమూర్​లో 7 సెం.మీ. వర్షపాతం నమోదైంది.  రామారెడ్డి 3.3, మాచాపూర్​లో 3.3, బొమ్మదేవునిపల్లి 2.9,  నాగిరెడ్డిపేట 2.7, ఆర్గొండ 2.6,   డొంగ్లిలో 2.5, హాసన్ పల్లి 2.5, మెనూర్ 2.1,  లింగంపేట 1.9, బీబీపేట 1.9, జుక్కల్, కొల్లూర్​లలో 1.7, కామారెడ్డి 1.3, సదాశివనగర్​లో 1.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.