రాష్ట్రానికి ఎల్లో అలర్ట్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు

రాష్ట్రానికి ఎల్లో అలర్ట్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు

రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు వర్ష సూచన ఉంటుందని పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం చల్లబడిందని తెలిపింది.

ఇవాళ, రేపు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 6 జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ని వాతావరణ శాఖ జారీ చేసింది.