
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ శివారు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. రెండు గంటల్లో నాలుగు సెంటీమీటర్ల వాన పడింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎల్బీనగర్, నాగోలు, చైతన్యపురి, అల్కాపురి, చింతలకుంట, దిల్సుఖ్నగర్, సరూర్నగర్, హయత్ నగర్, మల్కాజిగిరిలో భారీ వర్షం కురిసింది. చాలాచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు తప్పలేదు.
అత్యధికంగా సరూర్ నగర్, నాగోలులో 4.70 సెంటీమీటర్లు, ఎల్బీనగర్ లో 3.80, వనస్థలిపురంలో 3.65, కంచన్బాగ్లో 3.55, మల్కాజిగిరిలో 3.05, సైదాబాద్ లో 3 సెంటీమీటర్ల వాన పడింది. మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్లో అలర్ట్(6.45 సెం.మీ. నుంచి 11.55 సెం.మీ. కురిసే చాన్స్) జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. మాన్సూన్ఎమర్జెన్సీ టీమ్స్తో వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. అత్యవసరమైతే హెల్ప్ లైన్ నంబర్ 040–-2111111 ని సంప్రదించాలన్నారు.