
వాయువ్య బంగాళాఖాతంలో ఆవర్తనం అల్పపీడనంగా మారింది. రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింతగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 2 న శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అల్పపీడన ప్రభావంతో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని.. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.
మరో వైపు గోదావరి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం దగ్గర ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.78 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజి దగ్గర కృష్ణానది ప్రవాహం 3.42 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు జాగ్రత్తలు తీసుకోవాలనివిపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
తెలంగాణలో కూడా రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెపలిం15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది