
ఖుషి సినిమా రీరిలీజ్ రూపంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి న్యూఇయర్ గిఫ్ట్ అందింది. 20 ఏండ్ల తర్వాత వచ్చినా, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. థియేటర్లన్నీ హౌజ్ ఫుల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో నిన్న రాత్రి కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రేవతి థియేటర్ లో ఖుషి సినిమా ప్రదర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సందడి చేశారు. సీఎం పవర్ స్టార్ అంటూ ప్లకార్డులతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా చేశారు. దాంతో థియేటర్ ముందు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.