తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్లోని ఓ రైలులో ఆగస్టు 26 ఉదయం గ్యాస్ సిలిండర్పేలిన విషయం విదితమే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఈ ఘటనకు కారణమైన గ్యాస్ సిలిండర్ని అధికారులు గుర్తించారు.
చిత్రంలో మీరు చూస్తున్నది 10 మంది ప్రాణాలు బలికొన్న గ్యాస్సిలిండరే. దాని పేలుడుకు గల కారణాలు కనుక్కునే పడ్డారు అధికారులు. ఉదయం జరిగిన ఘటనలో రైలులోని 60 మందికి పైగా గాయపడ్డారు.క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్కిచెన్ లోని సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.
మృతులను ఉత్తర ప్రదేశ్ వాసులుగా గుర్తించారు. రామేశ్వరం నుంచి కన్యాకుమారి వైపు వెళ్తున్న ఈ ట్రైన్ ఘటనపై జిల్లా కలెక్టర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది.