
తమిళ స్టార్ హీరో కార్తీ(Karthi) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జపాన్(japan). దర్శకుడు రాజ్ మురుగన్(Rajmurugan) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజైన ఈ మూవీ ట్రైలర్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అంచనాలను కూడా పెంచేసింది. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదుచూస్తున్నారు.
ఇక కార్తీ కెరీర్ లో 25వ సినిమాగా వస్తున్న ఈ సినిమా అభిమానులకు స్పెషల్గా ఉండాలని.. ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు కార్తీ. తన సోదరుడు సూర్య లాగే సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు కార్తీ. ఇందులో భాగంగా రూ. 1.25 కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అనాథాశ్రమాలలో అన్నదానాలు చేయడానికి ఈ భారీ మొత్తాన్ని వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీ తీసుకున్న గొప్ప నిర్ణయానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కార్తీ భయా నువ్వు గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read :-నేను ఏ తప్పూ చేయలేదు.. నాకోసం సంఘీభావం తెలిపిన వారికి అభినందనలు: చంద్రబాబు