ఖైదీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన కార్తి.

ఖైదీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన కార్తి.

ఖైదీ మూవీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు హీరో కార్తి. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో మాట్లాడిన కార్తి.. ఈ మేరకు హింట్ ఇచ్చాడు. దీంతో ఖైదీ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 2019లో లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో డిల్లీ పాత్రలో కనిపించిన కార్తి.. అద్భుతమైన నటనని కనబరిచాడు. ఇక రిలీజ్ టైంలోనే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటిచారు మేకర్స్. అప్పటినుండి ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఆడియన్స్.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కార్తి నటిస్తున్న సినిమాల్లో పొన్నియిన్ సెల్వన్ 2 ఒకటి. ఈ సినిమాని తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ మూవీ.. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకి రానుంది. మూవీ ప్రమోషన్స్ లో బాగంగా మేకర్స్ ప్రీ–రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కార్తి "PS-2" సినిమా గురించి మాట్లాడాడు. ఆయన మాట్లాడుతున్నంతసేపు అక్కడున్న ప్రేక్షకులంతా.. డిల్లీ, డిల్లీ అంటూ కేకలు పెట్టారు. అది గమనించిన కార్తి.. ఖైదీ–2 త్వరలో ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ అప్డేట్ తో అటు కార్తి ఫ్యాన్స్, ఇటు ఖైదీ మూవీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కానీ.. ఖైదీ సీక్వెల్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడంలేదు. ఎందుకంటే.. ప్రస్తుతం లోకేష్ విజయ్ తో "లియో" మూవీని తెరకెక్కంచే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అవడానికి కనీసం 2 సంవత్సరాలైనా పడుతుంది. కాబట్టి.. కార్తి ఖైదీ సీక్వెలపై హింట్ ఐతే ఇచ్చాడు కానీ.. ఆ సినిమా ప్రేక్షకులముందుకి రావాలంటే మాత్రం మరో 2,3 సంవత్సరాలు ఆగక తప్పదు.