Swamy RaRa: సూపర్ హిట్ స్వామిరారాకు సీక్వెల్.. హీరో నిఖిల్ పోస్ట్ వైరల్

Swamy RaRa: సూపర్ హిట్ స్వామిరారాకు సీక్వెల్.. హీరో నిఖిల్ పోస్ట్ వైరల్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్(Nikhil Siddarth), కలర్స్ ఫేమ్ స్వాతి(Swathi) జంటగా వచ్చిన స్వామిరారా(SwamyRaRa) సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు సుధీర్ వర్మ(Sidheer varma) తెరకెక్కించిన ఈ క్రైమ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. నిజం చెప్పాలంటే నిఖిల్ కెరీర్ నిలబడటానికి ఈ సినిమానే కారణం. ఈ సినిమా తరువాతనే నిఖిల్ కెరీర్ తరుణ్ అయింది. కేవలం రూ.3 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.10 కోట్లు కలెక్ట్ చేసి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. 

అయితే.. ఈ సినిమా గురించి తాజాగా హీరో నిఖిల్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా వచ్చిన స్వామిరారా విడుదలై 11 ఏళ్ళు పూర్తయిన సంధర్బంగా ఈ సినిమా సీక్వెల్ పై పోస్ట్ పెట్టారు నిఖిల్. గాయ్స్.. స్వామిరారా 2 తీద్దామా? ఈ సినిమాకు సీక్వెల్ చేయొచ్చు.. మీరేమంటారు అంటూ హీరోయిన్ స్వాతి, డైరెక్టర్ సుధీర్ వర్మను ట్యాగ్ చేసాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ పోస్ట్ చూసిన  స్వామిరారా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. నిజానికి ఈ సినిమా సీక్వెల్ కోసం ఆడియన్స్ కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా నిఖిల్ పెట్టిన పోస్ట్ తో.. అన్నా తొందరగా సీక్వెల్ ప్లాన్ చేయండన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగా ఈ సినిమాకు సీక్వెల్ రానుందా? నిఖిల్ చేసిన ఈ ప్రపోజల్ పై దర్శకుడు సుధీర్ వర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.