మైసూరులో అమ్మవారిని దర్శించుకున్నా హీరో

మైసూరులో అమ్మవారిని దర్శించుకున్నా హీరో

హీరో రామ్ చరణ్‌‌..  మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్‌‌‌‌’ చిత్రం షూటింగ్‌‌ గత కొద్దిరోజులుగా మైసూర్‌‌‌‌లో జరుగుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు వేసేందుకు షూటింగ్‌‌కు చిన్న బ్రేక్ ఇచ్చి హైదరాబాద్‌‌ వచ్చిన చరణ్.. తిరిగి మైసూర్‌‌‌‌ వెళ్లి షూటింగ్‌‌లో జాయిన్ అయ్యారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌‌ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌‌. ఎనభై శాతం వరకూ షూటింగ్ పూర్తయింది.