‘రావణాసుర’ సౌండ్ దద్దరిల్లుతుంది: రవితేజ

‘రావణాసుర’ సౌండ్ దద్దరిల్లుతుంది: రవితేజ

రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. అభిషేక్ నామా, రవితేజ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో రవితేజ మాట్లాడుతూ ‘టీమ్ అంతా కలిసి బెస్ట్ అవుట్‌‌పుట్ ఇచ్చారు. హీరోయిన్‌‌ మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా పర్ఫెక్ట్‌‌గా చేశారు. సుశాంత్ చాలా సాఫ్ట్ పర్సన్. ఇందులో కొత్త సుశాంత్‌‌ను చూస్తారు. సుధీర్ వర్మ దీని తర్వాత నెక్స్ట్ లెవల్‌‌ డైరెక్టర్​ అవుతాడు. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌‌గా ఉన్నాం. పెద్ద హిట్ అయి నిర్మాతలుగా నాకు, అభిషేక్ నామాకు  మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. ఏప్రిల్ 7న థియేటర్స్‌‌లో మామూలుగా ఉండదు. సౌండ్ దద్దరిల్లుతుంది’ అన్నాడు.

రవితేజతో వర్క్ చేయడం హ్యాపీగా ఉందని, ఆయనలో చాలా ఎనర్జీ ఉందన్నారు హీరోయిన్స్. సుధీర్ వర్మ మాట్లాడుతూ ‘రవితేజ పెర్ఫార్మెన్స్ చూసి థ్రిల్ అవుతారు. సుశాంత్‌‌ది మరో సర్‌‌‌‌ప్రైజింగ్ క్యారెక్టర్. కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నాడు. ‘ఈ వేడుక చూస్తుంటే 50 రోజుల పండగలా ఉంది. ఇక్కడే యాభై రోజుల పండగ  చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం’ అన్నారు నిర్మాత. మూవీటీమ్‌‌తో పాటు దర్శకులు గోపీచంద్ మలినేని, వంశీ, హను రాఘవపూడి, నిర్మాతలు సురేష్​ బాబు, వివేక్ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.