ఫిబ్రవరి 3న ‘మైఖేల్’ వస్తున్నాడు

ఫిబ్రవరి 3న  ‘మైఖేల్’ వస్తున్నాడు

సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జయకోడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘మైఖేల్’. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌‌. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న సౌత్ ఇండియన్ లాంగ్వేజ్‌‌లతో పాటు హిందీలోనూ రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘నాకిది చాలా స్పెషల్ ఫిల్మ్. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మీ శరత్‌‌కుమార్, వరుణ్ సందేశ్ లాంటి వెర్సటైల్ యాక్టర్స్ ఇందులో నటించారు.మేమందరం కథని, దర్శకుడు రంజిత్‌‌ని బలంగా నమ్మాం. మా నమ్మకాన్ని ట్రైలర్‌‌‌‌కి వచ్చిన రెస్పాన్స్ నిలబెట్టింది. కథ, కంటెంట్‌‌తో పాటు మేకింగ్ పరంగా ఇది యూనివర్సల్‌‌గా రీచ్ అయ్యే సినిమా. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అన్నాడు.

ఈ టీమ్‌‌తో కలిసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని దివ్యాంశ చెప్పింది.‘ఈ సినిమాతో సందీప్ నెక్స్ట్ లెవల్‌‌కి వెళ్తాడనే నమ్మకం ఉందని.. ఇందులో నేనూ పార్ట్ అవడం హ్యాపీ’గా ఉందని వరుణ్ సందేశ్ అన్నాడు. రంజిత్ జయకోడి మాట్లాడుతూ ‘ఇందులో యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి.సందీప్ చేసిన హార్డ్ వర్క్ తెరపై కనిపిస్తుంది. టెక్నికల్‌‌గా కూడా సినిమా చాలా రిచ్‌‌గా ఉంటుంది’ అని చెప్పాడు.‘టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై హ్యుజ్ బజ్‌‌ని క్రియేట్ చేశాయి. రోజురోజుకి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. సినిమాపై నమ్మకంగా వెళుతున్నాం. కచ్చితంగా సక్సెస్ కొడతాం’ అన్నారు నిర్మాతలు.